మరోసారి గాయపడ్డ హీరో విశాల్..

మరోసారి గాయపడ్డ హీరో విశాల్..

Published on Jul 11, 2014 8:02 AM IST

vishal
హీరో విశాల్ కు మరోసారి గాయాలయ్యాయి. తమిళ చిత్రం ‘పూజై’ షూటింగ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గతంలో ఇదే సినిమా కోసం ఒక ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు గాయలవడంతో కొన్ని రోజుల విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా మరోసారి గాయపడడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ తమిళనాడులో కారైకుడి ప్రాంతంలో జరుగుతుంది. హీరోపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యముడు, సింగం వంటి మాస్ యాక్షన ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు హరి ‘పూజై’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివల ‘ఇంద్రుడు’ సినిమాతో విజయం అందుకున్న విశాల్ ‘పూజై’ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అందుకోసం రిస్కీ ఫైట్స్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఏప్రిల్ నెలలో ‘పూజై’ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రికరిస్తున్నప్పుడు బ్రిడ్జి మీద నుంచి కింద పార్క్ చేసి వున్న కార్ మీదకి జంప్ చేసే సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు విశాల్ ఎడమ చేతికి దాదాపు 20 కుట్లు పడినట్లు పడ్డాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు