డాక్యుమెంటరీ ఫిల్మ్ షూటింగ్ మొదలెట్టిన మంచు విష్ణు

డాక్యుమెంటరీ ఫిల్మ్ షూటింగ్ మొదలెట్టిన మంచు విష్ణు

Published on Aug 22, 2014 5:20 PM IST

manchu-vishnu

100 సంవత్సరాల భారత చలన చిత్ర రంగంలో తెలుగు చిత్ర పరిశ్రమకి 83 ఏళ్ళ భాగస్వామ్యం మరియు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఏదన్నా చెయ్యాలని డా. మోహన్ బాబు కోరినప్పుడు మంచు విష్ణు 83 ఏళ్ళ తెలుగు సినీ రంగంపై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ తీసి తెలుగు చిత్ర సీమకి అంకితం ఇవ్వాలనుకున్నారన్న విషయాన్ని మీకు ఇదివరకే తెలియజేశాం.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాంతో మంచు విష్ణు, అతని టీం నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభించారు. ఈ డాక్యుమెంటరీలో ఎవరెవరు నటించనున్నారు అనేది మరికొద్ది రోజుల్లో అధికారికంగా తెలియజేయనున్నారు.

ఇదిలా ఉంటే మంచు విష్ణు హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘అనుక్షణం’ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దాసరి నారాయణరావు డైరెక్షన్ లో మంచు విష్ణు నటిస్తున్న ‘ఎర్రబస్సు’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు