మహేష్ బాబు, రాజమౌళి లకు థ్యాంక్స్ చెప్పిన వినాయక్ !

మహేష్ బాబు, రాజమౌళి లకు థ్యాంక్స్ చెప్పిన వినాయక్ !

Published on Jan 18, 2017 6:48 PM IST

vvvinayak
‘అఖిల్’ చిత్ర పరాజయంతో కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిన దర్శకుడు వినాయక్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ని విజయవంతంగా డైరెక్ట్ చేసి తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తెచ్చుకుని ఆనందంగా ఉన్నారు. ఈరోజు హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన ప్రెస్ మీట్లో ఇదే విషయాన్ని ఆయన మీడియాతో తెలిపారు. సినిమాని ఇంతటి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కూడా థ్యాంక్స్ చెప్పారు.

అలాగే ఖైదీ చిత్రం చూసి తమ ట్వీట్స్ ద్వారా సినిమా చాలా బాగుందని, బాస్ చిరంజీవికి ఇదే సరైన రీ ఎంట్రీ అని మెచ్చుకున్నారని, వాళ్ళు ట్వీట్స్ ద్వారా ఇచ్చిన పోత్సాహానికి చాలా కృతజ్ఞతలని, ఇంకా ట్వీట్స్ వేసి ప్రోత్సహించిన ఇతర సెలబ్రిటీలకు కూడా కృతజ్ఞతలని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో నిర్మాత అల్లు అరవింద్ ఖైదీ ఫస్ట్ వీక్ గ్రాస్ కలెక్షన్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.108. 48 కోట్లని, ఈ వసూళ్లు ఇంకా పెరుగుతాయని అధికారికంగా తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు