మహేష్ చూపు ఆదర్శకుడి వైపేనట…!

మహేష్ చూపు ఆదర్శకుడి వైపేనట…!

Published on Nov 17, 2019 5:53 PM IST

మహేష్ సంక్రాంతి మూవీ సరిలేరూ నీకెవ్వరూ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో టీజర్ కూడా విడుదల చేయనున్నారు. గత ఏడాది ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ చిత్రం తరువాత మహేష్ ఎవరితో చేయనున్నారనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.

ఐతే మహేష్ తదుపరి దర్శకుడిపై అనేక రూమర్స్ చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. మొదట సందీప్ రెడ్డి వంగాతో మహేష్ మూవీ ఆల్ మోస్ట్ ఖాయం అనుకున్నారంతా…, ఐతే సందీప్ మళ్ళీ బాలీవుడ్ లోనే ఓ క్రైమ్ డ్రామా తెరకెక్కిస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించేశారు. ఇక గీత గోవిందం దర్శకుడు పరుశురాం లేదా మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి తో మూవీ చేసే అవకాశం కలదు. వీరెవ్వరూ కాకుండా ఓ కొత్త దర్శకుడితోనైనా మహేష్ మూవీ చేసే అవకాశం కలదు. వంశీ పైడిపల్లితోనే మహేష్ మూవీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు