నిఖిల్, కలర్స్ స్వాతీ కలిసి నటించిన ‘స్వామీ రారా’ సినిమా మంచి విజయం సాధించింది. మరోసారి ఈ జంట ‘కార్తికేయ’ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం నిర్మాణాంతర దశలో వుంది. వచ్చే నెల విడుదలకావచ్చని అంచనా
చందూ మొందేటి దర్శకుడు. ఒక పురాతన దేవాలయం చుట్టూ తిరిగే కధ ఇది. నిఖిల్ ఒక మెడికో పాత్రను పోషించాడు. తమిళనాడు ప్రాంతాలలో దీసిన ఈ సినిమాను ఏకకాలంలో తెలుగు తమిళ భాషలలో విడుదల చేయాలని భావిస్తున్నారు
ఈ సినిమాని కూడా విజయం వైపు పయిన్చేల చేసి నేటి తరం హిట్ పెయిర్ అనిపించుకోవాలని నిఖిల్, స్వాతి లు భావిస్తున్నారు.మరి వారి కళలు నిజమవుతాయో లేదు సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది