‘ఇద్దరి లోకం’తోనైనా పరిస్థితి మారుతుందా ?

‘ఇద్దరి లోకం’తోనైనా పరిస్థితి మారుతుందా ?

Published on Oct 22, 2019 2:00 AM IST

చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘అర్జున్ రెడ్డి’.. ఎవరూ ఊహించని విధంగా సంచలనాత్మక విజయాన్నే అందుకుంది. అయితే ఆ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ తో రెచ్చిపోయిన షాలినీ పాండేకు మాత్రం ఆ సినిమా తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘118’ను మినహాయిస్తే.. అర్జున్ రెడ్డి తరువాత ఆమెకు హీరోయిన్ గా సరైన సినిమానే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా వచ్చింది షాలినీకి. ఈ సినిమాలో ఆమెను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు.

మరి ఈ సినిమాతోనైనా షాలినీ పాండేకు కాలం కలిసి వస్తోందేమో చూడాలి. షాలినీ మాత్రం ‘ఇద్దరి లోకం’తో తన పరిస్థితి మారుతుందని నమ్ముతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జిఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ కె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని నవంబర్ లో విడుద‌ల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు