సుజిత్ మళ్ళీ సాహో టీమ్ తోనే…?

సుజిత్ మళ్ళీ సాహో టీమ్ తోనే…?

Published on Nov 22, 2019 9:03 AM IST

ఈ ఏడాది సాహో మూవీపై జరిగినంత చర్చ బహుశా ఏ చిత్రానికి ఈ మధ్య కాలంలో జరిగిఉండదు. దాదాపు రెండు నెలలు ఇండియా మొత్తం సాహో మేనియా తో ఊగిపోయింది. ఐతే సాహో మిశ్రమ ఫలితాలు అందుకుంది. హిందీ వర్షన్ హిట్ గా నిలువగా అనూహ్యంగా తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజ్ లలో నష్టాలు మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా 420కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కడం మరియు భారీ ధరలకు అమ్మడం వలన నష్టాలు మిగిల్చింది. అలాగే సాహో సినిమా తీసిన సుజీత్ పై కొందరు విమర్శలు గుప్పించారు.

ఐతే లేటెస్ట్ సమాచారం ప్రకారం సుజీత్ తన మూడవ చిత్రం కూడా యూవీ క్రియేషన్ బ్యానర్ లోనే చేస్తున్నారట. సుజీత్, హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ఓ మూవీ రానుందని గతంలోనే వార్తలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ నిర్మించే అవకాశం కలదని సమాచారం. సుజీత్ మొదటి చిత్రం శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ కాగా ఆ చిత్రాన్ని నిర్మించింది యూవీ క్రియేషన్స్ వారే. దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు