సౌందర్య రజినీ ‘కొచ్చాడియాన్’ సీక్వెల్ చేస్తారా.?

సౌందర్య రజినీ ‘కొచ్చాడియాన్’ సీక్వెల్ చేస్తారా.?

Published on Jul 26, 2014 2:00 PM IST

Soundarya

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మొట్ట మొదటిసారిగా మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీని ఉపయోగించి తీసిన సినిమా ‘కొచ్చాడియాన్’. రజినీకాంత్, దీపిక పడుకునే, శోభన కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. కానీ ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అలాగే రజినీకాంత్ సినిమాకి వచ్చేంత రేంజ్ లో రాలేదు. దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమాకి సీక్వెల్ ని తీసే ఆలోచనని విరమించుకున్నారు.

తాజాగా రియల్ వర్క్స్ స్టూడియో అధినేత శివప్రసాద్ వేలాయుధం తన టీం తో కలిసి ‘కొచ్చాడియాన్’ కి సీక్వెల్ గా ‘రణధీరన్’ అనే టైటిల్ పెట్టి ఓ ట్రైలర్ ని రూపొందించాడు. అందులోనూ అతను జస్ట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించ్చుకొని ఈ ట్రైలర్ ని రూపొందించాడు. ఇటీవలే విడుదలైన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ చూసిన సౌందర్య రజినీ కాంత్ ‘ఓపెన్ సోర్స్ ని ఉపయోగించుకొని సూపర్బ్ గా ట్రైలర్ డిజైన్ చేసారు. త్వరలోనే శివప్రసాద్ వేలాయుధం ని కలుస్తానని’ ట్వీట్ చేసింది.

దేన్నీ బట్టి కోలీవుడ్ వర్గాలు మళ్ళీ సౌందర్య రజినీకాంత్ ‘కొచ్చాడియాన్’ సీక్వెల్ పై ఆసక్తి చూపే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే శివప్రసాద్ వేలాయుధంని కలిసిన తర్వాత ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి కొచ్చాడియాన్ కి సీక్వెల్ ఉంటుందా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది..

‘రణధీరన్’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – రణధీరన్ ట్రైలర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు