రిలీజ్ కి సిద్దమవుతున్న శర్వానంద్ ‘ఏమిటో ఈ మాయ’

రిలీజ్ కి సిద్దమవుతున్న శర్వానంద్ ‘ఏమిటో ఈ మాయ’

Published on Aug 17, 2014 8:12 PM IST

Yemito-Ee-Maaya

యంగ్ హీరో శర్వానంద్, మలయాళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా ‘ఏమిటో ఈ మాయ’. ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజా సంచారం ప్రకారం ఈ సినిమాని త్వరలో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ చేరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో స్రవంతి రవికిషోర్ నిర్మించాడు. ప్రకాష్ రాజ్, సంతానం కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాలో జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

శర్వానంద్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రన్ రాజా రన్’ సినిమా గత నెల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు శర్వానంద్ సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆసక్తి చూపుతారు. దాంతో ‘ఏమిటో ఈ మాయ’ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్రొడక్షన్ టీం ముందుకు వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు