తెలంగాణ విలేజ్ ని దత్తత తీసుకున్న మరో హీరో

తెలంగాణ విలేజ్ ని దత్తత తీసుకున్న మరో హీరో

Published on Oct 5, 2015 12:19 PM IST

adhitya-om
భారత్ ప్రధాని ప్రముఖులు పల్లెలను దత్తత తీసుకొని వాటిని డెవలప్ చెయ్యాలని పిలుపునిచ్చాడు. అప్పట్లో ఈ మాట పెద్దగా కనెక్ట్ కాకపోయినా రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. అంతే కాకుండా మహేష్ బాబు ఆంధ్ర, తెలంగాణాలలో చెరొక విలేజ్ ని దత్తత తీసుకున్నాడు. అలాగే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లాంటి హీరోలు కూడా దత్తత తీసుకొని తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో యంగ్ హీరో కూడా తెలంగాణా విలేజ్ ని దత్తత తీసుకున్నాడు.

లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆదిత్య ఓం ఖమ్మం జిల్లాలో భద్రాచలంకి దగ్గరలోని చెరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఈ గ్రామం మామూలుగా ఏజన్సీ ఏరియా.. అక్కడి ప్రజలు తాగునీరు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఆ సమస్యను పరిష్కరించడానికి ఆదిత్య ఓం ప్లాన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆదిత్య ఓం అక్కడి ఆనందం ఫౌండేషన్ – అమ్మ నాన్న ఫౌండేషన్ తో కలిసి ఆ గ్రామాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య నెక్స్ట్ సినిమా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు