మంచు విష్ణు తదుపరి చిత్రంలో రెజినా

మంచు విష్ణు తదుపరి చిత్రంలో రెజినా

Published on May 23, 2015 9:00 PM IST

vishnu
మెగా ఫ్యామిలీ నాయికగా గుర్తింపు పొందిన రెజినా తాజాగా మంచు విష్ణు తదుపరి చిత్రంలో నాయిక స్థానం సంపాదించుకున్నట్టు సమాచారం. మంచు విష్ణు ప్రస్తుత ప్రాజెక్ట్ ‘డైనమైట్’ షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర దశలో వుంది. ప్రస్తుతం రెజినా సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటిస్తుంది.

మంచు విష్ణు తాజా చిత్రానికి కొత్త దర్శకుడు హనుమాన్ ని ఎంచుకున్నాడు. రాజ్ కుమార్ నిర్మాత. ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రస్తుతం ఆదితో ‘గరమ్’ సినిమాను రూపొందిస్తుంది. ముందుగా ఈ పాత్రకు రాశీఖన్నాని అనుకున్నా ఆఖరికి ఆ అవకాశం రెజినాకి దక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు