మెంటల్ మదిలో కు పాజిటివ్ టాక్ !

మెంటల్ మదిలో కు పాజిటివ్ టాక్ !

Published on Nov 21, 2017 8:36 PM IST

ప్రేమ ఇష్క్ కాదల్, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు తాజాగా ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో సినిమాలో నటించిన విషయం తెలిసిందే. నూతన దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.

నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది. ఇప్పటికే ఈ సినిమాను చుసిన పలువురు సినిమా బాగుందని చెప్పడం విశేషం. గతంలో పెళ్లి చూపులు సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ ఈ సినిమాకు రావడంతో చిత్ర యూనిట్ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు