మరో కొత్త సినిమాని లైన్లో పెట్టిన యంగ్ హీరో ?

మరో కొత్త సినిమాని లైన్లో పెట్టిన యంగ్ హీరో ?

Published on Apr 24, 2017 11:18 AM IST


పోయిన సంవత్సరం ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో మంచి సక్సెస్ ను నదుకునం యువ హీరో నాగ శౌర్య ఈ ఏడాది ఇంకా బాక్సాఫీస్ ముందుకు రాలేదు. ప్రస్తుతం నూతన దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్న నాగ శౌర్య తాజాగా మరొక ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాకు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్న సాయి శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది.

సాయి శ్రీరామ్ చెప్పిన కథ, అందులోని పాత్రలు నచ్చడంతో నాగ శౌర్య ఈ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగా ఉన్నారట. ప్రస్తుతం సమాచారంగా మాత్రమే ఉన్న ఈ విషయంపై నాగ శౌర్య క్లారిటీ ఇచ్చే వరకు కాస్త వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ హీరో చేస్తునం సినిమా ద్వారా కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న టాలీవుడ్ కు పరిచయమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు