‘ఎర్రబస్సు’తో దాసరి దూకుడు.

dasari-vishnu

70 ఏళ్ళ వయసులో కూడా ఉరకలేసే ఉత్సాహంతో యువకులతో పోటి పడుతూ పని చేస్తూ షూటింగ్ స్పాట్ లో అందరిలో జోష్ నింపుతున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. 150 సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి 151వ సినిమాగా ‘ఎర్రబస్సు’ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ‘ఎర్రబస్సు’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. దాసరి, మంచు విష్ణు, అలీ తదితరులు షూటింగ్లో పాల్గొంటున్నారు.

మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. విష్ణు తాతయ్యగా దాసరి కొత్త గెటప్’లో కనిపించనున్నారు. విష్ణు సరసన కేథరీన్ త్రేసా హీరోయిన్ గా నటిస్తుంది. పల్లెటూరి నుండి మనవడి కోసం సిటీకి వచ్చిన తాత ఎటువంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు అనే కధాంశంతో తెరకెక్కుతుంది. తమిళంలో ఘన విజయం సాదించిన ‘మాంజ పాయ్’కి రీమేక్ ఇది.

Exit mobile version