తెలుగు యువ హీరోల్లో యాక్టింగ్ విషయంలో, డ్యాన్స్ విషయంలో రామ్కి మంచి పేరుంది. తన గత చిత్రాలైన ఒంగోలు గిత్త, మసాలా లాంటి సినిమాలు అనుకున్న రేంజ్లో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని, వరుస సినిమాలతో మన ముందుకు రానున్నాడు రామ్. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పండగ చేస్కో’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. ఇక గత నెలలో మొదలుపెట్టిన ‘శివం’ రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు రామ్. ఈ సినిమాతో శ్రీనివాస్ రెడ్డి అనే కొత్త దర్శకుడు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నాడు.
ఇవేకాక ‘హరికథ’ అనే చిత్రంలో రామ్ నటించనున్నాడు. సెకండ్ హ్యాండ్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కిషోర్ ఈ ‘హరికథ’కు దర్శకత్వం వహించనున్నాడు. తాజా సమాచారం మేరకు ఈనెల 31న హరికథ సినిమాను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. రామ్ ‘పండగ చేస్కో’ త్వరలోనే వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.