మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగ స్థలం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నారు . తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన చరణ్ విలేకరులతో ముచ్చటించారు . రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరుపున జనసేన పార్టీ కి ప్రచారం చేస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చరణ్ హుషారుగా సమాధానం ఇచ్చాడు. నేను 2009 లో ప్రజా రాజ్యం పార్టీ కి క్యాంపెయిన్ చేస్తానన్నానని అప్పుడు బాబాయ్ వద్దు అనడం తో ఆగిపోయాను అన్నారు. ఇప్పుడు అయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీ అని అంతెందుకు అయన చిటికేస్తే చాలు వెళ్లిపోతానని అయన ఎప్పుడు పిలుస్తారోనని వెయిట్ చేస్తున్నానని అన్నారు చరణ్ .
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ లో పర్యటిస్తూ బిజీ గా వున్నారు . మరి పవన్ రామ్ చరణ్ ని ఎన్నికలకు తమ పార్టీ తరుపున ప్రచారం చేయమని పిలుస్తారో లేదో చూడాలి.