‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం దర్శకుడిగా మారాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘ఫలక్ నుమా దాస్’ అనే చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఈ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ఇటివలే మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కానీ ఈ సారి దర్శకుడిగా కాదు, హీరోగా కార్టూన్ అనే చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే.
కాగా ప్రదీప్ పులివర్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రానున్న ఈ ‘కార్టూన్’ చిత్రంలో విశ్వక్ సేన్ విలన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో విలనే మెయిన్ అట.
డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చేతుల మీదుగా ఇటివలే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. డిఫరెంట్ జోనర్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా జూన్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.