‘ఛలో’ లాంటి చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియోషన్స్ బ్యానర్ లో రమణ తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇప్పటికే మెదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. కాగా జూన్ 8 నుండి వైజాగ్ లో రెండవ షెడ్యూల్ ని ప్లాన్ చేసింది చితబృందం. ఈ షెడ్యూల్ లో దర్శకుడు రమణ తేజ విజన్ కి తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట.
ఈ చిత్రంలో నాగశౌర్యకి జంటగా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహరిన్ హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకుల అలరించబోతుంది. పోసాని కృష్ణమురళీ, సత్య, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీచరణ్, కెమెరా మనోజ్ రెడ్డి, ఎడిటర్ గారీ బిహెచ్, డైరెక్షన్ రమణ్తేజ, ప్రొడ్యూసర్ ఉషాముల్పూరి,