నటుడు శరత్కుమార్, ఆయన భార్య రాధికలను అరెస్ట్ చేయాల్నిందిగా న్యాయస్థానం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే నటుడు శరత్కుమార్, రాధికా శరత్కుమార్, మరొక నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ కలిసి ఇంతకు ముందు కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో వారు రేడియన్స్ మీడియా సంస్థ నుంచి తీసుకున్న రుణం రూ.2 కోట్లకుగానూ చెక్కును ఇచ్చారు. అయితే ఆ చెక్కు బౌన్స్ అయ్యింది.
దీంతో ఆ రేడియన్స్ మీడియా సంస్థ తరఫున శరత్కుమార్, రాధికాశరత్కుమార్, లిస్టింగ్ స్టీఫెన్లపై చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై స్పందించిన సైదాపేట కోర్టు ఆ ముగ్గురిని అరెస్ట్ చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు.