పూరి జగన్నాథ్ ఎలాగైనా ఈ సారి ఓ భారీ హిట్ కొట్టాలనే కసితో చేస్తోన్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ – నిధి అగర్వాల్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. అయితే ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునప్పటికీ సినిమాలో బూతులు శృతిమించాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ దెబ్బకే ఫ్యామిలీ ఆడియన్స్ ను దూరం చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’, అదేవిధంగా సినిమాలో మోతాదుకు మించిన యాక్షన్ సీక్వెన్స్ తో రెచ్చిపోతే మాత్రం లవర్స్ కూడా ఈ చిత్రానికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఇక ఓన్లీ మాస్ ఆడియన్స్ ను మాత్రామే టార్గెట్ చేసుకుని ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ హిట్ కొట్టాలి. అయితే ఈ మధ్య పూరి కథలన్నీ ఒకేలా సాగుతున్నాయనే అపవాదు ఎలాగూ ఉంది. మరి వీటన్నిటినీ దాటుకుని ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ కొట్టాలంటే.. సినిమాకి సూపర్ హిట్ టాక్ రావాల్సిందే. అసలుకే ‘ఇస్మార్ట్ శంకర్’ పై పూరి జగన్నాథ్ తో పాటు రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ లు కూడా చాలానే ఆశలు పెట్టుకున్నారు. మరి ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ నలుగుర్ని ఏం చేస్తాడో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు ఇప్పటికే బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్ లో కనపింబోతున్నారు. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.