సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఒకపక్క షూటింగ్ ను జరువుకుంటూనే, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటుంది. కాగా దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ చిత్రం యొక్క బిజిఎమ్ పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ రోజు చెన్నైలోని తన స్టూడియోలో ఈ సినిమా కెమెరామెన్ రత్నవేలు దేవిని కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళు దిగిన ఫోటోను దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేస్తూ.. ‘అతని లెన్స్ కు ఫెన్స్ లేదు .. అతని ప్యాషన్కు బౌండరీలు లేవు.. అతనే.. ఓన్లీ వన్ రత్నవేలు అంటూ పోస్ట్ చేశారు.
కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
His LENS has no FENCE..
His PASSION has no BOUNDARIES..
1&Only @RathnaveluDop Sir..It was Awesome 2 hav U in d Studio Dear Randy sir! Lov Ur positivity & Humbleness❤️????????
Waiting 2 witness ur MAGIC in #SarileruNekevvaru @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @iamRashmika pic.twitter.com/EBBWii1cH3— DEVI SRI PRASAD (@ThisIsDSP) November 6, 2019