తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే మంచి హిట్ అందుకున్నాడు రాహుల్ రవీంద్రన్. పైగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది ఆ సినిమా. కానీ తన రెండో చిత్రంగా కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మన్మథుడు 2ను తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.
కాగా ప్రస్తుతం తన కొత్త స్క్రిప్ట్ను పూర్తి చేసే దిశలో ఉన్నాడు రాహుల్. అయితే స్క్రిప్ట్ రాస్తోంది సినిమా కోసం కాదు, వెబ్ సిరీస్ కోసమట. నెట్ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నాడట. అయితే ఈ వెబ్ సిరీస్ యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రాహుల్ ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.