ఏపీ సీఎం జగన్తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ని కలిసిన నాగార్జున దాదాపు గంట పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే చర్చల అనంతరం సీఎం జగన్తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ బేటీలో నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్రెడ్డి సహా మరికొందరు పాల్గొనట్టు తెలుస్తుంది.