పాన్ ఇండియన్ వైడ్ వీక్షకులు ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాసివ్ హీరోలతో చేసిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ నుంచి ట్రైలర్ కి రంగం సిద్ధం అవుతుండగా మేకర్స్ రిలీజ్ చేస్తున్న ఒక్కో పోస్టర్ తో సినిమా మరిన్ని అంచనాలు నెలకొల్పుకుంటుంది.
మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై మరియు ఇద్దరి స్టార్ హీరోస్ పై పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ అవుతుంది. “రాజమౌళి చేసిన ఈ ఎమోషనల్ డ్రైవ్ ని చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నారని ఇద్దరినీ కూడా స్క్రీన్ పై చూడ్డానికి మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని” పూజా హెగ్డే చాలా ఎగ్జైటింగ్ గా పోస్ట్ చేసింది. మరి తన సినిమా కూడా ప్రభాస్ తో చేసింది “రాధే శ్యామ్” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.
Cannot wait for the emotional drive through that Rajamouli sir has in store for us with RRR, @AlwaysRamCharan and @tarak9999 you both are looking fantastic! ???? cannot wait to see you both set the screen on fire ???? ????????
— Pooja Hegde (@hegdepooja) December 6, 2021