పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద, ముఖ్యంగా యుఎస్ఎలో తిరుగులేనిదిగా కనిపిస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా కళ్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ యాక్షన్ చిత్రం 1.75 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆదివారం నాటికి 2 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోనుంది. అంతే కాకుండా కేవలం 2 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ఈవెన్ను అందుకుంది.
తమ అభిమాన నటుడు ఔట్ అండ్ అవుట్ మాస్ పాత్రలో కనిపించడం పట్ల సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ మల్టీ స్టారర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగ వంశీ నిర్మించారు. రోల్లో ఉన్న తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.