టాక్..పవన్ మరోసారి ప్రయోగం చేయనున్నాడా.?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. “హరిహర వీరమల్లు” అనే ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతూ భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తర్వాత పవన్ లైనప్ మరింత ఆసక్తిగా మారగా లేటెస్ట్ గా దర్శకుడు హరీష్ శంకర్ తో అయితే మరో సినిమాని అంటే మూడో సినిమాని పవన్ చేయనున్నట్టుగా పలు రూమర్స్ బయటకి వచ్చాయి.

మరి దీనిపై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి పవన్ మరోసారి రచయితగా మారనున్నట్టుగా తెలుస్తుంది. గతంలో పవన్ తన జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ లకు కథను తానే ప్రిపేర్ చేసుకుని స్క్రీన్ ప్లే చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మళ్ళీ తన సొంత కథతోనే పవన్ రానున్నట్టుగా పలు ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో అనేది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version