నా కళావతి గ్యాంగ్ ని మిస్ అవుతున్నా – కీర్తి సురేష్


టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక్కో సినిమాతో ప్రేక్షకాభిమానుల నుండి మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. నేను శైలజ మూవీతో టాలీవుడ్ కి నటిగా పరిచయం అయిన కీర్తి, ఆ మూవీతో మంచి విజయం అందుకున్నారు. అనంతరం దివంగత దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన మహానటి మూవీతో పెద్ద సక్సెస్ అందుకోవడంతో పాటు ఆ సినిమాలో సావిత్రి పాత్రలో అత్యద్భుత నటన కనబరిచినందుకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డుని అందుకున్నారు కీర్తి.

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకాభిమానులు ముందుకి వచ్చిన కీర్తి తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన సినీ, వ్యక్తిగత సంగతులని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. గత ఏడాది తన కళావతి గ్యాంగ్ తో ఎంజాయ్ చేసిన బ్యూటిఫుల్ మెమొరీస్ ని ఎప్పటికీ మర్చిపోలేను, వాళ్లందరినీ మిస్ అవుతున్నాను అంటూ కొద్దిసేపటి క్రితం అప్పటి తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేసారు కీర్తి. కాగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version