“RRR” మొదలై నాలుగేళ్లు..చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

“RRR” మొదలై నాలుగేళ్లు..చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Nov 18, 2021 12:35 PM IST


ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో అనౌన్స్ చేసిన మాసివ్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ ఇది. అయితే ఈ మెగా మల్టీ స్టారర్ చిత్రం అనౌన్స్ అయ్యి సరిగ్గా ఈరోజుతో నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుంది.

సరిగ్గా నాలుగేళ్లు ఐటం 2017లో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ఒక ఫ్లెజెంట్ ఫోటో తో అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనితో ఈ భారీ సినిమా చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. నాలుగేళ్లు కిందట రాజమౌళి ఈ పిక్ పెట్టి ఎన్నో ఊహాగానాలకు నాంది పలికారు. సినిమా మొదలు పెట్టి 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 50 రోజుల్లో ఈ సినిమా మ్యాజిక్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. దీనితో ఇది వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు