5 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోన్న “కొండ పొలం” ట్రైలర్

5 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోన్న “కొండ పొలం” ట్రైలర్

Published on Sep 28, 2021 11:16 AM IST

వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కొండ పొలం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు ఇప్పటికే ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటి వరకూ 5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వై. రాజీవ్ రెడ్డి, జే. సాయి బాబు లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రం విడుదల అవుతుండటం తో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాయి చంద్, కోట శ్రీనివాస్ రావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, ఆంతోని, రవి ప్రకాష్, మహేష్ విట్ట, రచ్చ రవి, ఆనంద్ విహారి లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు