“ఆదిపురుష్” ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదా?

“ఆదిపురుష్” ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదా?

Published on Nov 5, 2022 8:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్”. భారీ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం రామాయణం ఆధారంగా ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రంలో రామునిగా ప్రభాస్ నటించగా కృతి అయితే జానకి దేవి పాత్రలో నటించింది. ఇక ఈచిత్రం పై అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ చిత్రం వాయిదా పై పలు రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే వీటికి కారణాల్లో సినిమా గ్రాఫికల్ వర్క్ ఒకటి బాలన్స్ ఉండగా మరొకటి అయితే సినిమా రీ షూట్స్ ఉంటాయని తెలిసింది. మరి వీటిలో అయితే ఓ రూమర్ నిజం కాదు అని తెలుస్తుంది. ఇప్పుడు సినిమాకి మేకర్స్ కేవలం వి ఎఫ్ ఎక్స్ వర్క్ మాత్రమే చేస్తున్నారట. రీ షూట్స్ అయితే ఏమీ లేవని ఇప్పుడు అంతర్గత సమాచారం. ఇక కొత్త రిలీజ్ డేట్ కోసం కూడా అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు