దళపతి విజయ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వారసుడు”. మరి మెయిన్ గా తమిళ్ లోనే “వరిసు” పేరిట రిలీజ్ చేస్తున్న ఈ చిత్రాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కె మంచి హంగామా చేస్తుండగా ఇప్పుడు అయితే మేకర్స్ ఓ క్రేజీ పోస్టర్ ని విజయ్ మరియు రష్మికా లపై రిలీజ్ చేశారు.
మరి ఇప్పుడు వరకు వచ్చిన అన్ని పోస్టర్స్ లో అయితే ఇది కాస్త డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాంగ్ లో ఇద్దరినీ ఒకేసారి చూస్తే మన తెలుగు నేటివిటీ బాగా కనిపిస్తుంది. అలాగే మాస్ షేడ్స్ లో కూడా అనిపిస్తుంది. దీనితో ఈ కొత్త పోస్టర్ మరింత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. ఇక ఈరోజు సాయంత్రం అయితే ఈ టోటల్ సాంగ్ రిలీజ్ కానుండగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఈ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.
Let the countdown begin nanba ????#RanjithameFromToday 5:30 PM.
????️ #Thalapathy @actorvijay sir & @manasimm
???? @MusicThaman
????️ @Lyricist_Vivek@directorvamshi @iamRashmika @AlwaysJani #BhushanKumar #KrishanKumar #ShivChanana @TSeries
#Ranjithame #Varisu #VarisuPongal pic.twitter.com/cQojtDDJFL— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2022