మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పటికీ కూడా మెగాస్టార్ హీరోగా భారీ ఓపెనింగ్స్ అయితే తన సినిమాలతో అందుకుంటూ తన క్రేజ్ ఇంకా ఎలా ఉందో చూపిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అయితే తాను నటించిన చిత్రం “వాల్తేర్ వీరయ్య” తో మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో వెళ్ళింది.
మరి ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా అయితే ఓ మెగా ట్రిబ్యూట్ చూసి తాను ఎనలేని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మరి డీటెయిల్స్ లోకి వస్తే.. మల్లారెడ్డి కాలేజ్ లో దాదాపు 6 వేల మంది స్టూడెంట్స్ వారి గ్రౌండ్స్ లో మెగాస్టార్ రూపం తీర్చి దిద్ది ఒక మెగా ట్రిబ్యూట్ ని అయితే అందించారు.
మరి వారంతా మెగాస్టార్ లా కూర్చొని వాల్తేర్ వీరయ్య గెటప్ లో మెగాస్టార్ పిక్ తో అదరగొట్టారు. దీనితో ఈ వీడియో వైరల్ అవుతుండగా దీనిని చూసి దర్శకుడు బాబీ కాలేజ్ యాజమాన్యానికి, అలాగే వారు చూపించిన ప్రేమకి పెద్ద థాంక్స్ తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.
What a great tribute to our Megastar @KChiruTweets garu from the students and Management of Mallareddy college ????????????
Clearly shows your love and affection towards BOSS ????, Big thanks from me and the entire team of #WaltairVeerayya ????❤️@MythriOfficial https://t.co/nv932COUnH— Bobby (@dirbobby) October 30, 2022