టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం నిన్ననే పండుగతో ఈ కరోనా పరిస్థితిలో ముందుగా అనుకున్న ఫిబ్రవరి 4న రిలీజ్ చేయడం లేదని ఒక చేదు వార్త ఇచ్చారు.
కానీ అది ఇచ్చిన 24 గంటల్లోనే మళ్ళీ బిగ్గెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ కి అందించారు. ఈ అవైటెడ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. “ఆచార్య” సినిమాని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఏప్రిల్ 1న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఇపుడు ఈ మెగా మాస్ అప్డేట్ ఊహించని బ్లాస్ట్ గా ఈ కనుమ రోజు కిక్ ఇచ్చింది.
మరి ఈ భారీ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
This Ugadi, Witness the MEGA MASS on big screens ????????#Acharya Grand Release on April 1 ????#AcharyaOnApril1
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/DwnYRcakcd
— Konidela Pro Company (@KonidelaPro) January 16, 2022