కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తెలిశాయి. ఈ సినిమా నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఇదొక మాస్ మసాలా ఎంటర్టైనర్ అని, సబ్జెక్ట్ ఎక్కువగా స్థానికంగా ఉంటుందని, అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది.
మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. ఇక ఈ సినిమా పై డైరెక్టర్ మారుతి రీసెంట్ గా స్పందిస్తూ.. ‘సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. దయచేసి అప్పటి వరకూ వేచి ఉండండి. డైరెక్టర్ గా నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్’ అని మారుతి చెప్పుకొచ్చాడు. ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి.. మారుతి రేంజ్ మారిపోయినట్టే.
ఇక ప్రస్తుతం దర్శకుడు మారుతి గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. పైగా మారుతి నుంచి మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు, అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.