కోలీవుడ్ అత్యుత్తమ నటులలో విశాల్ ఒకరు. విశాల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాఠీ. ఈ చిత్రం డిసెంబర్ 23, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. నేడు హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ సినిమాపై సందడి పెంచేందుకు గ్రాండ్గా ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నటుడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలీసు కానిస్టేబుళ్లందరికీ లాఠీ చిత్రం అంకితమన్నారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ భవనం 3500 మంది కళాకారులు మరియు రంగస్థల కళాకారుల కోసం. ఈ భవనం కట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ స్పష్టం చేశాడు. కళాకారుల జీవితాలను మెరుగు పరచగల ఈ భవనం నిర్మాణంలో తాను మరియు తన బృందం తీవ్రంగా కృషి చేస్తున్నామని విశాల్ తెలిపారు.