సత్య దేవ్ కోసం అడివి శేష్…డీటెయిల్స్ ఇవే!

సత్య దేవ్ కోసం అడివి శేష్…డీటెయిల్స్ ఇవే!

Published on Dec 4, 2022 6:00 PM IST


టాలీవుడ్ ప్రామిసింగ్ యాక్టర్ సత్య దేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుర్తుందా సీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 9, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, రేపు హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ ఈవెంట్‌ కి హాజరు కానున్నారు. గుర్తుందా సీతాకాలం లో తమన్నా భాటియా కథానాయిక గా నటిస్తుంది. నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్‌మెంట్స్, శ్రీ వేదాక్షర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు