పీవీ సింధు తో హీరో అడివి శేష్…పిక్ వైరల్!

పీవీ సింధు తో హీరో అడివి శేష్…పిక్ వైరల్!

Published on Jun 22, 2022 8:00 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ మేజర్ చిత్రం సక్సెస్ తో దూసుకు పోతున్నారు. తాజాగా ఈ హీరో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన పీవీ సింధు తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఛాంపియన్ పీవీ సింధు తో బ్యాడ్మింటన్ ఆడటం మాత్రమే కాకుండా, గ్రిప్ మరియు ఫుట్ వర్క్ టిప్స్ నేర్చుకున్న విషయాన్ని వెల్లడించారు. అడివి శేష్ మరియు పీవీ సింధు ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రం లో అడివి సేష్ సూపర్ పెర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. అడివి శేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు