ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన అడివి శేష్!

వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకు పోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. అడివి శేష్ హీరోగా హిట్2 సినిమా థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రాన్ని హిందీ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అయితే ఈ వరుస హిట్ చిత్రాల హీరో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.

తుఫాన్ కి ముందు అంతా కామ్ గా ఉంటుంది అని అన్నారు. కొత్త ప్రాజెక్ట్ ప్రకటన తో వస్తున్నట్లు తెలిపారు. కూల్ గా, స్టైలిష్ గా ఉన్న ఒక ఫోటో ను షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version