వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అడివి శేష్ “మేజర్”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అడివి శేష్ “మేజర్”

Published on May 4, 2023 9:24 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితంలోని నిజ సంఘటనల ఆధారం గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

త్వరలో జెమిని టీవీ లో మేజర్ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది. ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, రేవతి, మురళి శర్మ, అనిష్ కురువిళ్ళ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, a+s మూవీస్ పతాకాల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు