ప్రశాంత్ వర్మతో మరో సీక్వెల్ చేస్తున్న తేజ సజ్జ?

ప్రశాంత్ వర్మతో మరో సీక్వెల్ చేస్తున్న తేజ సజ్జ?

Published on Feb 6, 2025 7:09 AM IST

మన టాలీవుడ్ లో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన భారీ హిట్ చిత్రం “హను మాన్” కోసం అందరికీ తెలిసిందే. రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమా అదరగొట్టింది. మరి ఈ సినిమాకి గ్రాండ్ సీక్వెల్ గా “జై హనుమాన్” ని కూడా ఇపుడు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఇపుడు ఈ సీక్వెల్ కాకుండా ఇదే కాంబినేషన్ నుంచి మరో మ్యాడ్ సీక్వెల్ వస్తుంది అని తెలుస్తోంది.

హను మాన్ కంటే ముందు వచ్చిన క్రేజీ సినిమా “జాంబీ రెడ్డి” ఎలా ఎంటర్టైన్ చేసిందో అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా వచ్చి నిన్నటితో నాలుగేళ్లు పూర్తయింది. అయితే ఈ సినిమాకే ఇపుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జలు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే తేజ చేసిన సస్పెన్స్ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. దీనితో ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తుందా అనేది చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు