“ఆదిపురుష్” కి భారీ బడ్జెట్ తో మరోసారి రిపేర్లు.?

“ఆదిపురుష్” కి భారీ బడ్జెట్ తో మరోసారి రిపేర్లు.?

Published on Nov 2, 2022 12:18 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఇప్పుడు కాస్త రచ్చ కూడా నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

అయితే ఇప్పుడు సినిమా లేట్ అవ్వడానికి కారణం అయితే మళ్ళీ సినిమా వి ఎఫ్ ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ దృష్టి పెట్టగా ఆ ఒక్క అంశం కోసం అయితే భారీ బడ్జెట్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే సినిమాలో కొన్ని పార్ట్స్ వరకు కూడా మెయిన్ లీడ్ పై రీ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో అయితే మళ్ళీ ఈ చిత్రాన్ని రిపేర్లు చేస్తున్నారని చెప్పాలి. మరి ఈ సినిమాలో అయితే కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించగా లంకేశునిగా సైఫ్ అలీఖాన్ నటించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు