‘ఆహా’ మరియు మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

‘ఆహా’ మరియు మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.!

Published on Aug 17, 2022 7:00 PM IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు దిగ్గజ నిర్మాణ సంస్థలలో మంచి కంటెంట్ తో బెస్ట్ సినిమాలు అందిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. అయితే మైత్రి మూవీ మేకర్స్ మరియు మన తెలుగు పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ ఆహా వారి మొట్టమొదటి ప్రిస్టేజియస్ కలయికలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని అయితే తాము సంయుక్తంగా అనౌన్స్ చేశారు.

దీనిని ప్రౌడ్ గా మేకర్స్ ప్రెజెంట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ కి “సత్తి గాని రెండెకరాలు” అనే టైటిల్ ని రివీల్ చేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో “పుష్ప” ఫేమ్జగదీశ్ మరియు నటుడు రాజ్ తిరందాసు లు అలాగే దామా అనీషా, ఇంకా వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఈరోజే పూజా కార్యక్రమంతో మొదలైన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకుంది. మరి దీనిపై ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు