గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ లో “అఖండ” ట్రయో సందడి.!

గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ లో “అఖండ” ట్రయో సందడి.!

Published on Nov 25, 2022 1:00 PM IST

గత ఏడాది మాత్రమే కాకుండా మన టాలీవుడ్ సినిమా దగ్గర కూడా ఓ గుర్తుండిపోయే భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రం “అఖండ” కూడా నిలిచింది. మరి బాలయ్య మరియు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ నుంచి వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రం బాలయ్య కెరీర్ లోనే రికార్డు గ్రాసర్ గా నిలవడమే కాకుండా రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ విజయవంతంగా అత్యధిక రోజులు థియేటర్స్ లో ప్రదర్శితం అయ్యిన సినిమాగా కూడా నిలిచింది.

అయితే గత కొన్నాళ్ల కితమే గోవాలో జరగనున్న ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి గాను స్పెషల్ స్క్రీనింగ్ కి అఖండ ఎంపిక అయ్యిన సంగతి తెలిసిందే. మరి తాజాగా ఈ 53వ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ సందర్భంగా ఈ సినిమా సెన్సేషనల్ ట్రయో బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రెడ్ కార్పెట్ పై కనిపించి సందడి చేశారు. దీనితో ఈ ఫోటోలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు