ఫోటో మూమెంట్: విమానంలో సోనాల్ చౌహాన్‌తో అక్కినేని త్రయం!

ఫోటో మూమెంట్: విమానంలో సోనాల్ చౌహాన్‌తో అక్కినేని త్రయం!

Published on Sep 25, 2022 6:33 PM IST

గాడ్ ఫాదర్, జిన్నా మరియు స్వాతిముత్యం చిత్రాలతో కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు కర్నూలులో నిర్వహిస్తున్నారు మేకర్స్. అక్కినేని త్రయం నాగార్జున, నాగ చైతన్య మరియు అఖిల్ ఈ ఈవెంట్ కోసం విమానంలో సినిమా హీరోయిన్ సోనాల్ చౌహాన్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఫోటో ఈ రోజు సోషల్ మీడియాలో కనిపించింది. వెంటనే ఆ పిక్ వైరల్‌గా మారింది.

తమ ముగ్గురు హీరోలు కలిసి రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ది ఘోస్ట్ చిత్రానికి డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ లు ఈ సినిమా ను సంయుక్తం గా నిర్మించారు. భరత్, సౌరబ్ ద్వయం ఈ సినిమా కి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు