రిలీజైన “అల వైకుంఠపురములో” రీమేక్ టీజర్!

రిలీజైన “అల వైకుంఠపురములో” రీమేక్ టీజర్!

Published on Nov 22, 2022 9:11 PM IST


బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తన చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో టాలివుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల వైకుంఠ పూరములో రీమేక్ లో నటిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో అధికారిక హిందీ రీమేక్ అయిన షెహజాదా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

మొదటి ఫ్రేమ్ నుండి, కార్తీక్ మాస్ అవతార్‌లో చూపించబడ్డాడు. కృతి సనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ బ్లాక్‌లు ఒరిజినల్ నుండి ఎక్కువగా ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. రోహిత్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతను ప్లాట్‌ను రహస్యంగా ఉంచడం మాత్రమే కాకుండా, హీరోని మాస్ అవతార్‌లో మాత్రమే ప్రదర్శించి సినిమా పై ఆసక్తి రేకెత్తించారు.

పరేష్ రావల్, మనీషా కొయిరాలా, సచిన్ ఖేడేకర్, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ ఫిల్మ్స్, అల్లు ఎంటర్టైన్‌మెంట్, బ్రాట్ ఫిల్మ్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు