తమ అభిమాన కథానాయకుడి సినిమా థియేటర్లలో ఉన్నప్పటికీ.. చాల మంది అభిమానులు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోనే ఆ సినిమాని చూసేస్తున్నారు. దాంతో సినిమాకి వచ్చే కలెక్షన్స్ తగిపోతున్నాయి. ఈ సమస్య ఎక్కువుగా ఓవర్సీస్ లో కనిపిస్తోంది. ఈ మధ్య అక్కడి సినిమాల కలెక్షన్లు బాగా పడిపోయాయి. అందుకే బ్లూస్కై సినిమాస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ‘అల… వైకుంఠపురములో..’ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ మొత్తానికి దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్.. ఈ సినిమా థియేటర్లలో ఉన్నంతకాలం ఆమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో చూడలేరని ఆ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో బన్నీ సినిమా కలెక్షన్స్ పెరగనున్నాయి.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి తమన్ ఇచ్చిన ట్యూన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయట.
ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.