ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిసిన ఆలీ దంపతులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిసిన ఆలీ దంపతులు

Published on Nov 2, 2022 9:26 PM IST


తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్ గా తనకంటూ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించిన నటుడు ఆలీ. తన కెరీర్లో దాదాపుగా 1000కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కొన్నేళ్ళ క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తొలిసారిగా యమలీల సినిమా ద్వారా హీరోగా మారిన ఆలీ ఆ మూవీతో అతిపెద్ద హిట్టు కొట్టారు. అక్కడ నుంచి హీరోగా పలు సినిమాలు చేస్తూ కొనసాగిన ఆలీ ఇటీవల అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమా ద్వారా ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను స్థాపించి ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్నారు.

ఇటీవల ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో విడుదలై మంచి పేరు దక్కించుకుంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఆలీని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఇటీవల నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సందర్భంగా నేడు కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఆలీ దంపతులు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలానే తమ కుమార్తె ఫాతిమా వివాహానికి ప్రత్యేకంగా వైఎస్ జగన్ గారిని ఆహ్వానించారు. కాగా ఏపి సీఎం జగన్ గారిని ఆలీ దంపతులు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు