ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ప్రతి వారం ఎవరో ఒకరు సెలబ్రెటీలు వస్తూనే ఉంటారు. అయితే ఆలీ షోకు వచ్చిన సెలబ్రెటీల విశేషాలు, విషయాలను అడిగి తెలుసుకుంటూ, వారి లైఫ్లోని పలు జ్ణాపకాలను గుర్తు చేస్తూనే, మరో పక్క తనదైన స్టెయిల్లో సెలబ్రెటీలకు ప్రశ్నలు వేస్తూ కామెడీనీ పుట్టించి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంటాడు. అయితే వచ్చే వారానికి ఈ షోకు అలనాటి తారలు రోజారమణి, చక్రపాణి వచ్చి సందడి చేయబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.
అయితే అక్క, బావలంటూ వారిద్దరికి అలీ స్వాగతం పలికాడు. అయితే తనను దాసరి నారాయణరావు కుట్టి అని పిలిచేవారని రోజారమణి చెప్పుకొచ్చారు. తరుణ్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ‘మనసు మమత’తో పరిచయం చేసి, ‘నువ్వే కావాలి’ వంటి సూపర్ హిట్ మూవీ రామోజీరావు గారు అందించారని, ఆయన చాలా గ్రేట్ పర్సన్ అంటూ ఈటీవీతో తమకు, తమ కుటుంబానికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదని వారు అన్నారు. దాసరి నారాయణరావు గారితో కూడా చాలా అనుబంధం ఉండేదని వారు ఎమోషన్ అయ్యారు. అయితే తాను పెద్దగా చదువుకోలేదని కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో కలిసి భోజనం చేసే అవకాశం దక్కడం నిజంగా తన అదృష్టమని రోజారమణి అన్నారు. తన భర్తకు కోపమెక్కువ అని, కానీ ముక్కుసూటి మనిషి అని అన్నారు.
ఒకసారి స్విట్జర్లాండ్లో తండ్రీ కొడుకులు ఆగర్బత్తీలు అంటించి పూజ చేశారని ఆ పొగకు ఫైర్ ఏమైనా జరిగిందేమోనని పోలీసులు ఇంటికి వచ్చారని రోజారమణి చెప్పుకొచ్చారు. ఇక అలనాటి తార భానుమతి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె చాలా సరదాగా ఉండేవారని చక్రపాణి అన్నారు. ఆమె రోజారమణిని రమణరావు అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. అయితే ఇలా ఈ జంట ఇంకెన్ని మధుర జ్ఞాపకాలు, ఆసక్తికర విషయాలు ఆలీతో పంచుకున్నారన్నది పూర్తిగా తెలియాలంటే వచ్చే సోమవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగాను చూడాల్సిందే.