“భీమ్లా” డబుల్ ప్రీమియర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.!

“భీమ్లా” డబుల్ ప్రీమియర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.!

Published on Mar 23, 2022 6:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ లేటెస్ట్ సినిమా గత ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి థియేట్రికల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఇక్కడ రన్ అయ్యాక మళ్ళీ ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అది ఈ సినిమా ఓటిటి వెర్షన్ కోసం. ఈ చిత్రాన్ని రెండు ఓటిటి యాప్స్ ఆహా మరియు డిస్నీ+ హాట్ స్టార్ లో ఒక రోజు ముందే డబుల్ ప్రీమియర్ కి తీసుకువస్తున్నట్టు చేసిన అనౌన్సమెంట్ మరింత ఆసక్తిని అభిమానుల్లో రేపింది. దీనితో ఈ 24 సరిగ్గా రాత్రి 12 గంటలకి స్ట్రీమింగ్ కి వచ్చే సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

ముఖ్యంగా డిలీట్ చేసిన సన్నివేశాలు ఏమన్నా యాడ్ చేసారా అనే దాని కోసం పవన్ మరియు రానా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు