ఈరోజు ఎన్టీఆర్ స్పీచ్ కోసం అంతా వెయిటింగ్.!

ఈరోజు ఎన్టీఆర్ స్పీచ్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Nov 1, 2022 10:03 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ లో 30వ సినిమా దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే మరింత ఆలస్యం అవుతున్న కొద్దీ మరింత హైప్ పెరుగుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈరోజు అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కర్ణాటక లో జరగనున్న ఓ కీలక కార్యక్రమంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.

మరి కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం ఓ స్మరణ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమం కోసం గాను అక్కడి ప్రభుత్వం కోరిక మేరకు ఎన్టీఆర్ అయితే అతిధిగా వెళ్లనున్నారు. మరి ఈ ఎమోషనల్ డే న అయితే ఎన్టీఆర్ స్పీచ్ కోసం అభిమానులు సహా కన్నడ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పునీత్ కి అలాగే ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో అయితే ఎన్టీఆర్ మాటల విషయంలో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు